టేకులపల్లి సాంఘీక సంక్షేమ గురుకులంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సావాలు

Spread the love

National Library Anniversary Celebration at Tekulapally Social Welfare Gurukulam

టేకులపల్లి సాంఘీక సంక్షేమ గురుకులంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సావాలు

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

నవంబర్ 14 నుండి 20 వరకు జరుగు గ్రంథాలయ వారోత్సావాలను పురస్కరించుకొని టేకులపల్లి సాంఘీక సంక్షేమ గురుకులంలో గ్రంధాలయ పితామహులు ఎస్. ఆర్.రంగనాదన్ కి ఘనంగా నివాలర్పించడం జరిగింది.

ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ బాబు మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా మేధోశక్తి ని పెంపొందించుకొనడమే కాక మానసిక వికాసాన్ని పొందవచ్చు నని కావున ప్రతి విద్యార్థి విధిగా పుస్తక పఠనం అలవర్చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రగతిశీల తల్లితండ్రుల సంఘం (పి పి ల్) రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పుల.

రమణ కుమార్తె సాయి ప్రణీత పుట్టిన రోజుని పురస్కరించుకొని పాఠశాల గ్రంధాలయానికి పుస్తకాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ రీనాధారి,శైలజ,లైబ్రేరియన్ తార మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని పుస్తక పఠనం చేశారు.

Related Posts

You cannot copy content of this page