నాంపల్లి నియోజకవర్గ బి.ఆర్.ఎస్ శ్రేణులకు నుతనోత్తేజం నింపి , అందరికి అండగా ఉంటాను

Spread the love

నాంపల్లి నియోజకవర్గ బి.ఆర్.ఎస్ శ్రేణులకు నుతనోత్తేజం నింపి , అందరికి అండగా ఉంటాను అని తెలిపిన ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్…
సాక్షిత : పార్లమెంట్ ఎన్నికల సమావేశాల కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతు గా నాంపల్లి నియోజకవర్గం బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఆనంద్ గౌడ్ , ఎం.ఎల్.సి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో నాంపల్లి లోని ఎన్. ఎస్.ఎన్ ఫంక్షన్ హల్ లో నాంపల్లి నియోజకవర్గ సన్నహాక సమావేశాలు ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా హాజరైన సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్… ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ , బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు అభిషేక్ , విద్యా సాగర్ , అన్ని డివిజన్ ల అధ్యక్షులు లక్ష్మీ నారాయణ , అహ్మద్ అలీ , జకీ హుల్లా ఖాన్ , దయానంద , సంజయ్ , బాసిత్ తదితరులు పాల్గొన్నారు…

అనంతరం సికింద్రాబాద్ పార్లమెంట్ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి లోని అన్ని నియోజవర్గంలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం.నేను రాజకీయ కుటుంబం నుండి రాలేదు.స్వతహాగా కార్యకర్త స్థాయి నుండి కార్పొరేటర్ నుండి క్యాబినెట్ వరకు ఎదిగిన.ప్రతి ఒక్కరు నాకు అత్యంత సన్నిహితులు. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ముస్లిం లకు రంజాన్ తొఫ లు ఇస్తుండే. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు. అసలు సాధ్యం కానీ హామీలు ప్రజలకు ఇచ్చిండ్రు. సికింద్రాబాద్ ఎం.ఎల్.ఏ గా నాలుగు సార్లు గెలిచిన. నా పేరును ఎం.పి అభ్యర్థిగా కేసీఆర్ గారు ప్రకటించగానే ప్రతి ఒక్కరు మనం గెలుస్తున్నాం అన్న అని నాకు చెప్తున్నారు.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం.ఐదేండ్ల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ బి.ఆర్.ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ లు కూడా సరిగ్గా ఇస్తలేరు.ప్రజలు అన్ని గమనిస్తున్నారు.
హైదరాబాద్ ప్రజలు బి.ఆర్.ఎస్ పార్టీ కె పట్టం కట్టి ఎం.ఎల్.ఏ లు గా గెలిపించిండ్రు. గతంలో రైతు బంధు , దళిత బంధు , రైతు భీమా లాంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చి రైతులను రాజులను చేసి చూపించిండు కేసీఆర్ గారు ఇప్పుడున్న పరిస్థిలలో ఒక కేంద్ర మంత్రి , రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తో కొట్లాడబోతున్నాం. కాబట్టి ప్రతి కార్యకర్త బి.ఆర్.ఎస్ పార్టీ గెలుపు దిశగా ముందుకు కదలాలి. మనం గెలుస్తున్నాం. ప్రజలలో అవగాహన పెరిగింది.కాంగ్రెస్ , బిజెపి నాయకులను ప్రశ్నిస్తున్నారు.ఇప్పటివరకు ఏం చేసిండ్రు అని

మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ మాట్లాడుతూ పద్మారావు గౌడ్ నాకు మంచి మిత్రుడు.అన్న లాంటి వ్యక్తి ఆయన.ఇట్లాంటి నాయకుడు పార్లమెంట్ లో ఉండాలి. ఇప్పుడు ఉన్న పరిస్థిలలో నాంపల్లి కి ఇలాంటి ఎం.పి ఎంతో అవసరం. కాబట్టి మనమంతా ఏకతాటిపైకి వచ్చి పద్మారావు గౌడ్ గెలిపించుకోవాలి.కాంగ్రెస్ , బిజెపి పార్టీలను ఎవరు నమ్మొద్దు.నాంపల్లి నియోజకవర్గంలో పద్మారావు కు ఎక్కువ మెజారిటీ ఇచ్చే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేస్తూ ముందుకు నడవాలి.
,,,,,,,,,,,,,,,,,,,,

Related Posts

You cannot copy content of this page