తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర దంపతులు

Spread the love

MP Ravichandar couple visited Tirumala Srivara

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర దంపతులు

సాక్షిత ఖమ్మం :

రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సతీసమేతంగా తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు. పెట్రోలియం, సహజ వాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి ఆయన ప్రోటోకాల్ దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విజయవంతం అయినట్లుగానే.. పార్టీ ఆధ్వర్యంలో ఇక మీదట జరిగే కార్యక్రమాలు కూడా దిగ్విజయం కావాలని ఆయన కలియుగ దైవం వెంకటేశ్వరుడిని కోరుకున్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ తిరుగులేని రాజకీయ నేతగా రాణించేలా స్వామి వారి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నారు.
అనంతరం ఎంపీ రవిచంద్ర దంపతులకు రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించి, శాలువాలతో సత్కరించారు.

Related Posts

You cannot copy content of this page