ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్

Spread the love

Government Whip & Chennur MLA Balka Suman kept his promise

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ .

గాంధారి ఖిల్లా మైసమ్మ ఆలయానికి, వేలాల గట్టు మల్లన్న ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారులు పూర్తి.

రెండు ప్రధాన రహదారులకు 4.30 కోట్లు కేటాయింపు.

ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ఎమ్మెల్యే బాల్క సుమన్ .

చెన్నూరు నియోజకవర్గం, జైపూర్ మండలం, మహా శివరాత్రి పర్వదినాన ప్రతి ఏటా సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యే సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ వేలాల గట్టు మల్లన్న ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి.

చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కృషితో 2.20 కోట్లతో వేలాల కమాన్ దగ్గర నుండి గుట్టపైన ఆలయం వరకు నూతనంగా నిర్మించే సుమారు రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డు పూర్తయింది. అక్కడి నుండి గుట్ట పైకి వెళ్లే 700 మీటర్ల సీసీ రోడ్డు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

వచ్చే పది పదిహేను రోజుల్లో ఈ పనులు కూడా పూర్తి చేసుకొని వచ్చే శివరాత్రి లోపు ప్రజలకి అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. గత సంవత్సరం శివరాత్రి పర్వదినాన 01.03.22 న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

Related Posts

You cannot copy content of this page