మణిపూర్లో మహిళల పై అత్యాచారాలను కండిస్తూ సీపీఐ, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం.

Spread the love

మణిపూర్లో మహిళల పై అత్యాచారాలను కండిస్తూ సీపీఐ, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక దళితులపై, గిరిజనులపై,మహిళల పై దాడులు పెరిగాయని వాటిని అరికట్టకుండా నేరస్తులకు సన్మానం చెయ్యడం, నేరస్తులకు శిక్షలు పడవు అనే అభిప్రాయం ఏర్పడటం వల్లే హత్యలు, అత్యాచారాలు పెరిగాయని కావున మహిళలు బీజేపీని రానున్న ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, సీపీఐ సీనియర్ నాయకుడు ఏసురత్నం, మహిళ సమాఖ్య కార్యదర్శి హైమావతి అన్నారు.


మహిళల పై జరిగిన దష్టికాన్ని కండిచకుండా ఇతర వర్గాల పై దాడి చేశారు కావున మహిళల పై జరిగిందని సమర్దించుకోవడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమని ఒక మనిషిగా కాకుండా కనీసం మహిళగా కూడా చూడకపోవడం దారుణమని అన్నారు.బీజేపీకి మద్దతు ఇచ్చే మహిళలు ఆలోచించాలని కోరారు. సంఘటన జరిగిన 70 రోజుల వరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం,ఘటన వీడియో రూపంలో వచ్చి ప్రజాలనుండి తీవ్ర వ్యతిరేకత వచ్చాక అరెస్టు చెయ్యడం,అప్పటి వరకు ప్రభుత్వం, పోలీసులు చర్య తీసుకోకపోయావడం వెనుకాల ప్రభుత్వ మద్దతు ఉన్నట్లేనని అదే విదంగా బీజేపీ వచ్చినప్పటి నుండి విద్వేషం పెంచడం వల్లే నేడు మనిషిని మనిషిగా చూడకుండా మతం తో చూస్తున్నారని ప్రజల మధ్య స్నేహ భావం ఉండాలంటే బీజేపీని సాగనంపాలని అన్నారు.


ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి దుర్గయ్య,సీపీఐ కార్యవర్గ సభ్యులుహరినాథ్, సహదేవ్ రెడ్డి,సదానంద్, కృష్ణ,రాములు,శ్రీనివాస్ మహిళ సమైక్య నాయకురాలు మహేశ్వరి,లక్ష్మీ, ఏ ఐ వై ఎఫ్ అధ్యక్షుడు సంతోష్,శాఖ కార్యదర్శి సుధాకర్, నాయకులు వెంకటేష్, నర్సయ్య,ప్రభాకర్,శేఖర్, బాబు,ఖయుమ్, ఉపేందర్, బాల సంఘం నాయకులు చిన్నారులు సహస్ర,అక్షిత, భూమి,భవ్య,కీర్తి లు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page