వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం తథ్యం – ఎమ్మెల్యే ఆర్కే.

Spread the love

రాష్ట్ర ఎస్సి కమిషన్ సభ్యులు కట్టెపోగు బసవరావు వై నాట్ 175 కి సంఘీభావంగా ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు జరుగుతున్న పాదయాత్రలో భాగంగా మంగళగిరి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే, నియోజకవర్గ ఇన్చార్జి గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మాజీ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు తదితరులు…..

బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ వైఎస్ఆర్ మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ గార్ల విగ్రహాలకు ఘన నివాళులర్పించిన నేతలు..

చినకాకాని నేతన్న సర్కిల్ వద్ద నుండి మంగళగిరి కొత్త బస్టాండ్ వద్ద గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన పాదయాత్రలో పాల్గొన్న నేతలు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ :

పేదవాడి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి మళ్ళీ రావడం తద్యమని జోస్యం చెప్పారు…

రానున్న ఎన్నికల్లో పేదవాడికి పెత్తందారుడికి మధ్య యుద్ధం జరగబోతుందని.., ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ పేదవాడి కోసం పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి కి అండగా నిలబడేందుకు సిద్ధమయ్యారని అన్నారు…

వై నాట్ 175 కు మద్దతుగా ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేస్తున్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు కట్టెపోగు బసవరావు ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే అభినందించారు…

ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page