ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే పాదయాత్ర.. రూ.10.05 లక్షలతో చేపడుతున్న డ్రైనేజీ

Spread the love

MLA padayatra on public issues. Drainage is being done with Rs.10.05 lakh

ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే పాదయాత్ర.. రూ.10.05 లక్షలతో చేపడుతున్న డ్రైనేజీ పనులకు శంఖుస్థాపన


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ 128 డివిజన్ మరియు గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని రొడా మేస్త్రి నగర్ ఏ-బి, ఇంద్రనగర్ లలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అధికారులతో కలిసి పర్యటించారు. మొదటగా రూ.10.05 లక్షలతో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఇంద్రా నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం స్థానిక సమస్యలపై పాదయాత్ర చేసి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

ఈ మేరకు రోడ్లు, డ్రైనేజీ, మంచి నీటి పైపు లైన్లు, కరెంటు స్తంభాలు, మంచి నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దృష్టికి సమస్యలు తీసుకురాగా.. అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. అందుకు అవసరమైన వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఈఈ శిరీష, వాటర్ వర్క్స్ డిజిఎం అప్పల నాయుడు, ఏఈ సతీష్, ఏఈ సత్యనారాయణ మరియు సీనియర్ నాయకులు మహ్మద్ మక్సూద్ అలీ, పరుష శ్రీనివాస్ యాదవ్, చందు ముదిరాజ్, దిలీప్, ఫర్జానా బేగం, శమీమ్ బేగం, సింగారం మల్లేష్, దూలప్ప, మల్లేష్, మహేష్, సతీష్, మూసాకాన్, హమీద్, మోసిన్, వహీద్ ఖురేషి, రవుఫ్, బషీర్, నిజాం తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page