ప్రగతి యాత్ర‘లో భాగంగా 78వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన

Spread the love

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 78వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
గాజులరామారం JNNURM కాలనీలో పాదయాత్ర…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని గాజులరామారం JNNURM కాలనీలో “ప్రగతి యాత్ర”లో భాగంగా 78వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా పూర్తిచేసిన భూగర్భ డ్రైనేజీ, నూతనంగా చేపడుతున్న పార్క్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. కాగా సిసి రోడ్లు పూర్తి చేయాలని కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలిచ్చారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తీవ్ర మంచినీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్న తమకు శాశ్వత పరిష్కారం చూపినందుకు ఎమ్మెల్యే ని కాలనీవాసులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, వాటర్ వర్క్స్ జిఎం శ్రీధర్ రెడ్డి, డిఈఈ రూపా దేవి, ఏఈ కళ్యాణ్, డీజీఎం అప్పలనాయుడు, మేనేజర్ రోహిణి మరియు సీనియర్ నాయకులు రషీద్ బైగ్, కస్తూరి బాల్ రాజ్, పాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, కమలాకర్, తెలంగాణ సాయి, ఇబ్రహీం, సాయిబాబా, లక్ష్మణ్, ఇమ్రాన్ బైగ్, చెట్ల వెంకటేష్, మహేష్, లింగం, అహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page