మహిళాశక్తి, యువశక్తి ముందు ఏ దుష్టశక్తి నిలవలేదు : ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద…

Spread the love

*129 -సూరారం డివిజన్ నెహ్రు నగర్ లో ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద విజయానికి తమ పూర్తి మద్దతును తెలుపుతూ నెహ్రు నగర్ కాలనీ వాసులు, సేవాలాల్ బంజారా అసోసియేషన్ సంఘం వారు తమ పూర్తి మద్దతును తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద మాట్లాడుతూ బిఆర్ఎస్ పాలనలో కుత్బుల్లాపూర్ లోని అన్ని డివిజన్లలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని, బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిలో మహిళలు, యువకులు కీలకమన్నారు. మహిళా శక్తి, యువ శక్తి ముందు ఏ దుష్టశక్తి కూడా నిలవలేదన్నారు. నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో ప్రజా సంక్షేమం కోసం పనిచేసే పార్టీ బిఆర్ఎస్ కి అత్యధిక మెజారిటీ అందించి ముచ్చటగా మూడవసారి సీఎం కేసీఆర్ ని హ్యాట్రిక్ సీఎంగా గెలిపించుకోవాలన్నారు.

అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులూ అనిల్ నాయక్, జీషాన్ ఆధ్వర్యంలో వారి 200 మంది మిత్ర బృందంలోని యువకులు, లక్ష్మి ఆధ్వర్యంలో 40 మంది మహిళలు ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర్ రావు, సిద్దిఖ్, ఫిరోజ్, కిషన్ రావు, మధుమోహన్, అరుణ, హేమలత, షహనాజ్ బేగం, లావణ్య, ఇతర నాయకులు, కార్యకర్తలు, నెహ్రు నగర్ వాసులు గాదయ్య, నారాయణ, దశరథ్, నాగేష్, ప్రశాంత్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,

Whatsapp Image 2023 11 03 At 11.17.33 Am

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page