23 లక్షలతో కృష్ణా నగర్ పార్కు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

Spread the love

అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోల్నాక డివిజన్ లోని కృష్ణా నగర్ పార్కు సుందరీకరణ మరియు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ శ్రీమతి దూసరి లావణ్యశ్రీనివాస్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్కులో ప్రజలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా వివిధ రకాల మొక్కలు నాటడం, వాకింగ్ ట్రాక్, నీటి సౌకర్యం, కొత్త బెంచీలు, పెయింటింగ్, టైల్స్ వేయడం, పిల్లలకు క్రీడా సాధనాలు వంటి వాటితో పాటు విద్యుత్ దీపాలు, మరియు పటిష్టమైన ఆర్చ్, గేటు, పార్కు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించనున్నామని తెలిపారు. స్థానిక యువత కొరినట్లు వారి కోసం ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page