రూ.20 లక్షల నిధులతో సీసీ డ్రైనేజ్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

Spread the love

చందర్లపాడు గ్రామంలో “గడపగడపకు – మన ప్రభుత్వం” నిధులతో సీసీ డ్రైనేజీల నిర్మాణం ..
సంక్షేమం- అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..
చందర్లపాడు గ్రామంలో “గడపగడపకు- మన ప్రభుత్వం” నిధులు రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ డ్రైనేజీల నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు శంకుస్థాపన నిర్వహించారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు అభివృద్ధికి కూడా సమప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం ద్వారా స్థానికంగా ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడంతో పాటు సచివాలయ పరిధికి కేటాయిస్తున్న రూ.20 లక్షలతో అభివృద్ధి పనులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలో జరగని విధంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా ప్రజల ఇళ్ళ ముందుకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకొని, ప్రతి ఇంటికి మేలు జరిగే విధంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని తెలిపారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగేలా పాలన జరుగుతుందన్నారు. సీసీ డ్రైనేజీల నిర్మాణ పనులలో గుత్తేదారులు నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

Related Posts

You cannot copy content of this page