ఉదయ సముద్రం ప్రాజెక్ట్ భూసేకరణకై 22 కోట్లు మంజూరు – ఎమ్మెల్యే చిరుమర్తి

Spread the love

ఉదయ సముద్రం ప్రాజెక్ట్ భూసేకరణకై 22 కోట్లు మంజూరు – ఎమ్మెల్యే చిరుమర్తి

నార్కట్ పల్లి (సాక్షిత ప్రతినిధి)

నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ భూసేకరణ నిమిత్తం రూ. 22 కోట్లు మంజూరు చేయించినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. నకిరేకల్ ప్రాంత ప్రజల కలల ప్రాజెక్ట్ ఉదయ సముద్రం పూర్తికై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని ఆయన పేర్కొన్నారు. పెండింగ్ పనులకు వేగవంతం చేయించి వీలనయినంత తొందరలో సాగునీరు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. నిధులు మంజూరు చేసిన ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page