మియాపూర్ డివిజన్ పరిధిలోని RBR కాంప్లెక్స్, ఇంద్ర నగర్,JPN నగర్ కాలనీ లలో రూ. (182.50 లక్షలు) ఒక కోటి ఎనభై రెండు లక్షల యాబై వేల రూపాయల అంచనావ్యయం

Spread the love

సాక్షిత : మియాపూర్ డివిజన్ పరిధిలోని RBR కాంప్లెక్స్, ఇంద్ర నగర్,JPN నగర్ కాలనీ లలో రూ. (182.50 లక్షలు) ఒక కోటి ఎనభై రెండు లక్షల యాబై వేల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివుద్ది ఆగకూడదనే ఉద్దేశ్యం తో సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా మియాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

మంజూరైన అభివృధి పనుల వివరాలు…

1.మియాపూర్ డివిజన్ పరిధిలోని RBR కాంప్లెక్స్ వద్ద రూ. 80 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులు

2.మియాపూర్ డివిజన్ పరిధిలోని ఇంద్రా నగర్ లో రూ. 79 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులు

  1. మియాపూర్ డివిజన్ పరిధిలోని JPN నగర్ లో రూ.23.50 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు

పైన పేర్కొన్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు ముప్పవరపు గంగాధర్ రావు,మాధవరం గోపాల్ రావు,ప్రతాప్ రెడ్డి, మహేందర్ ముదిరాజ్, రఘునాథ్ రావు,గోపరాజు శ్రీనివాస్ రావు, మహమ్మద్ ఖాజా, వజీర్,రోజా, సుప్రజ,వరలక్ష్మి, రాజు గౌడ్, నర్సింగ్, వెంకటేశ్వరరావు, వాసు, స్వామి నాయక్, సుధాకర్, కృష్ణ, లక్పతి,రవి,శివ, జంగం మల్లేష్, కోటయ్య, నర్సింగ్ రావు, ముజిబ్, అబ్రహం మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page