ఈనెల 14న వేర్ హౌసింగ్ గోడౌన్ ప్రారంబించనున్న మంత్రులు సింగిరెడ్డి, పువ్వాడ

Spread the love

Ministers Singireddy, Puvvada to start warehouse housing godown on 14th of this month

ఈనెల 14న వేర్ హౌసింగ్ గోడౌన్ ప్రారంబించనున్న మంత్రులు సింగిరెడ్డి, పువ్వాడ..

20వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం.. రూ.14.90కోట్లతో నిర్మాణం.ఏర్పాట్ల ను పరిశీలించిన నాయకులు..
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

రఘునాథపాలెం మండలం జింకల తండాలో రూ.14.90 కోట్లతో 20వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యంతో నూతనంగా నిర్మించిన వేరే హౌసింగ్ గోడౌన్ ను ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కలిసి ప్రారంభించనున్నారు.

ఈ మేరకు ఆయా ప్రారంభోత్సవం, సభా ఏర్పాట్లను మండల నాయకులు శనివారం ఉదయం పరిశీలించారు.
నాయకులు అజ్మీరా వీరు నాయక్, మద్దినేని వెంకటరమణ, కుర్రా భాస్కర్ రావు, మందడపు నర్సింహరావు, మంత్రి పి ఏ. సీ హెచ్ రవి కిరణ్, పిన్ని కోటేశ్వరరావు, గుడిపుడి రామారావు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page