ఎల్ ఓ సి చెక్కులను పంపిణి చేసిన మంత్రి పువ్వాడ.

Spread the love

Minister Puvvada who sent the LoC cheques.

ఎల్ ఓ సి చెక్కులను పంపిణి చేసిన మంత్రి పువ్వాడ.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

వివిధ అనారోగ్యాలతో బాధపడుతూ చికిత్సల నిమిత్తం ముందస్తుగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసి ధరకాస్తు చేసుకున్న బాధితులకు మంత్రి పువ్వాడ సిఫారసు మేరకు మంజూరైన ఆయా చెక్కులను ఖమ్మం వీడియోస్ కాలనీ క్యాంపు కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బాధితులకు పంపిణి చేశారు.

రఘునాథపాలెం మండలం పాపటపల్లి గ్రామానికిచెందిన పి. విజయకు రూ.2.50 లక్షలు, మధిర నియోజకవర్గం ఇల్లురు గ్రామంకు చెందిన సిహెచ్ నాగేశ్వరరావుకు రూ.లక్ష, ఖమ్మం నగరంకు చెందిన జీ.సుభాని రూ.59 వేలు మొత్తం రూ.3.09 విలువైన చెక్కులను మంత్రి అందజేశారు.

Related Posts

You cannot copy content of this page