రూ.2.25 కోట్లతో అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపనలు

Spread the love
Minister Puvvada laid foundation stone for development works with Rs.2.25 crores

రూ.2.25 కోట్లతో అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపనలు..

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నగరంలో పలు డివిజన్ లలో రూ.2.25 కోట్లతో నిర్మించనున్న సి సి సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్ధాపన చేశారు.

ఖమ్మం నగరంలోని 2వ డివిజన్ బల్లేపల్లి లో రూ.45 లక్షలు, 4వ డివిజన్ బల్లేపల్లి స్టేజ్ నందు రూ.45 లక్షలు, 9వ డివిజన్ శ్రీశ్రీ సర్కిల్ లో రూ.45 లక్షలు, 13వ డివిజన్ శ్రీ నగర్ కాలనీలో రూ.45 లక్షలు, 11వ డివిజన్ కవిరాజ్ నగర్ లో రూ.45 లక్షలు మొత్తం రూ.2.25 కోట్లతో నిర్మించనున్న సీసీ సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్ధాపనలు చేశారు

.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, కార్పొరేటర్లు దండా జ్యోతి రెడ్డి, Sk జాన్ భీ, సరిపుడి రమాదేవి, కొత్తపల్లి నీరజ, పబ్లిక్ హెల్త్ ఇ ఇ రంజిత్, డీ ఇ లు స్వరూప రాణి, నవ్య జ్యోతి, రంగారావు, సిబ్బంది, డివిజన్ నాయకులు ఉన్నారు

Related Posts

You cannot copy content of this page