నీలం మధు ముదిరాజ్ ని అభినందించిన కేటీఆర్

Spread the love
సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ను ఎమ్మెల్సీ బండ ప్రకాష్ తో కలిసి హైదరాబాద్ ప్రగతిభవన్ లో తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్  మర్యాద పూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించినందుకు అభినందించారని  తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించేలా  ముందుకెళ్లాలని సూచించారని తెలిపారు. ప్రజల కోసం పనిచేసిన మహనీయులను గుర్తించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచి విషయమని తెలిపారని అన్నారు. ఈస్ఫూర్తితోనే మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తానని తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు ప్రజల కొరకు తాను ఎప్పుడు పని చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థి నాయకుడు అల్లుడు జగన్, డాక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్   తరితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page