కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ చెరువులో చేపలను వదిలిన శంభీపూర్ కృష్ణ …

Spread the love

Shambhipur Krishna left the fish in the Dundigal pond of Kutbullapur Constituency

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపల్ పరిధి దుందిగల్ గ్రామంలోని పెద్ద చెరువు, చిన్న చెరువులలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ముదిరాజ్ సంఘం నేతలతో కలిసి శంభీపూర్ క్రిష్ణ చేపలను వదిలారు. ఈ సందర్బంగా కృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందన్నారు.

ఇతర రాష్ట్రాలకు మన ప్రభుత్వం ఆదర్శముగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్ , వైస్ చైర్మన్ పద్మారావు , కమిషనర్ భోగేశ్వర్, కౌన్సిలర్లు కౌన్సిలరర్లు అమరం గోపాల్ రెడ్డి, జక్కుల విజయ కృష్ణ యాదవ్, జక్కుల శ్రీనివాస్ యాదవ్, డి ఆనంద్ కుమార్, మత్స్యకార శాఖ డైరెక్టర్ పిట్ల లక్ష్మణ్, మాజీ ఎంపీపీ చినంగి వెంకటేశం ముదిరాజ్, మత్స్యకార శాఖ డైరెక్టర్ పిట్ల లక్ష్మణ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నల్తూరు కృష్ణ, పీఏసీఎస్ డైరెక్టర్ కొత్తపేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కావలి గణేష్, మాజీ ఎంపీటీసీ బండారి మహేష్ , మున్సిపల్ తెరాస యూత్ అధ్యక్షులు మైసిగారి శ్రీకాంత్, ఆకుల భాస్కర్, విష్ణు యాదవ్, పిట్ల శ్రీశైలం, స్థానికులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page