SAKSHITHA NEWS

Minister Errabelli with the people who attended the self-respect meeting of Adivasi and Lambada tribes.

హైద‌రాబాద్ ఆదివాసీ, లంబాడా గిరిజ‌నుల ఆత్మ‌గౌర స‌భ‌కు త‌ర‌లిన ప్ర‌జ‌ల‌తో మంత్రి ఎర్ర‌బెల్లి.


సాక్షిత పెంబ‌ర్తి (జ‌న‌గామ‌ :
తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాల సంద‌ర్భంగా, తెలంగాణ ఆదివాసీ, లంబాడా గిరిజ‌నుల ఆత్మ‌గౌర‌వ కుమ‌రం భీం, సేవాలాల్ భ‌వ‌నాల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌కు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్లా నుంచి త‌ర‌లి వెళ్ళిన ప్ర‌జ‌తో క‌లిసి కొద్దిసేపు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పెంబ‌ర్తి వ‌ద్ద గ‌డిపారు.

వారితో మాట్లాడి వారికి జ‌రిగిన ఏర్పాట్ల‌పై ఆరా తీశారు. ప్ర‌శాంతంగా స‌భ‌కు వెళ్ళి. తిరిగి రావాల‌ని వారికి సూచించారు. అలాగే వారికి క‌ల్పించిన వ‌స‌తుల‌పై అధికారుల‌తో మాట్లాడారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లకు ఏలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూసుకోవాల‌ని ఆదేశించారు.


SAKSHITHA NEWS