మెట్టుకాని గూడ శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్లోని మెట్కాన్గూడ లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరిగిన జాతర మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీశైలం గౌడ్ ని ఘనంగా సత్కరించారు. స్వామివారి ఆశీస్సులతో కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ప్రజలంతా సుభిక్షంగా సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page