మంత్రి పొన్నం ప్రభాకర్ ని హైదరాబాద్ లో కలిసిన శ్రీ వేంకటేశ్వర దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు

Spread the love

మంటపం, గోపురం నిర్మాణ పనులను ప్రారంభించడానికి ఆహ్వానం
హుస్నాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి మంటపం, గోపురం నిర్మాణ పనులను ప్రారంభించడానికి తేది : 16 – 2 – 2024 శుక్రవారం రోజున రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ని దేవాలయ నిర్మాణ కమిటీ తరపున ప్రత్యేకంగా ఆహ్వానించాము.

ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించి తప్పకుండ వస్తాను అని తెలియజేశారు. మంత్రిని కలిసిన వారిలో శ్రీ వేంకటేశ్వర దేవాలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు వల్లపు రాజు, అధ్యక్షులు వరయోగుల మురళీధర్ స్వామి, ఉపాధ్యక్షులు వి.అనంత స్వామి, సభ్యులు గాదాసు రాంప్రసాద్, బొద్దుల శ్రీనివాస్ ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page