మట్టి వినాయకుల ను పూజిద్దాం…. పర్యావరణం ను పరిరక్షిద్దాం ..ప్రభుత్వ విప్ గాంధీ

Spread the love

మట్టి వినాయకుల ను పూజిద్దాం…. పర్యావరణం ను పరిరక్షిద్దాం ..ప్రభుత్వ విప్ గాంధీ .
సాక్షిత : శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ని మీటింగ్ హాల్ లో వినాయక చవితి పర్వదినం ను పురస్కరించుకుని శేరిలింగంపల్లి జోన్ జాయింట్ కమిషనర్ మల్లారెడ్డి , కార్పొరేటర్లు హమీద్ పటేల్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి కాలనీ అసోసియేషన్ సభ్యులకు, కాలనీ వాసులకు, మహిళ సోదరీమణులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులకు, కాలనీ వాసులకు బస్తీ వాసులకు తెలియచేయునది ఏమనగా వినాయక చవితికి పర్వదినం ను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం GHMC ద్వారా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మట్టి వినాయకులను ఉచితంగా పంపిణి చేయడం జరుగుతుంది అని,మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే నివాసం మరియు ఆయా డివిజన్ల కార్పొరేటర్ కార్యాలయాలలో విరివిగా మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అని ,
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని లోని ప్రతి కాలనీ కి మరియు వెల్ఫేర్ అసోసియేషన్ కి ఈ యొక్క మట్టి వినాయకులను ఉచితంగా పంపిణి చేయడం జరుగుతుంది అని, ఈ చక్కటి సదావకాశంను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వవిప్ గాంధీ పేర్కొన్నారు.
మట్టి వినాయకులను పూజించి మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకుందాం మరియు చెరువులను కలుషితం చేయకుండా వీలైనంత వరుకు మట్టి వినాయకులను మన యొక్క స్వగృహం ప్రాంగణంలో నే నిమర్జనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అని , అదేవిధంగా పర్యావరణ హితం మట్టి గణపతులను పూజించాలని ఈ విషయంలో మహిళలు ముందుండాలని, ప్రతి ఒక్కరికి అవగహన కలిపించాలని, మట్టి వినాయకులను పూజించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా భవిష్యత్ తరాల ను దృష్టిలో పెట్టుకొని సమాజ హితం పర్యవరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణ హితం ప్రతి ఓక్కరు మట్టి వినాయకులను పూజించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వినాయక విగ్రహాల ద్వారా చెరువులు కలుషితం అవుతాయి అని ,పర్యావరణ సమతుల్య త దెబ్బ తింటుంది అని కావున భావితరాలను దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయక విగ్రహాలను ప్రతి ఒక్కరు తప్పకుండా పూజించి పర్యావరణంను పరిరక్షించాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో AMOH నగేష్ నాయక్, శానిటేషన్ సూపర్ వైజర్ జలందర్ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి,శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు జంగం గౌడ్, చింత కింది రవీందర్, కొండల్ రెడ్డి, పద్మారావు, కృష్ణ యాదవ్, రాంచందర్ యాదవ్, వేణు గోపాల్ రెడ్డి ,నటరాజు, నరేందర్ బల్లా సత్యనారాయణ, లక్ష్మణ్ రావు,అరుణ కుమారి, రూపరెడ్డి ,నిర్మల, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page