స్థానిక కార్పొరేటర్ఇం
టింటికి తిరిగి బస్తి దర్శన్ కార్యక్రమం

Spread the love


Local corporator Basti darshan program back to Tinti

రామచంద్రపురం డివిజన్ లో ఉన్న వినాయక నగర్ కాలనీ లో స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ కాలనీ వాసులతో కలిసి ఇంటింటికి తిరిగి బస్తి దర్శన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఎల్లవేళలా 24 గంటలు అందుబాటులో ప్రజాసేవలో ఉంటాం అని కార్పొరేటర్ తెలిపారు.కాలనీ లో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యల గురించి కాలనీ వాసులను అడిగి తెలుసుకోవడం జరిగింది.

అలాగే కాలనీ ముఖద్వారం వద్ద జరుగుతున్న ఫ్లైఓవర్ పనుల ప్రజలు అవస్థల పాలవుతున్నారు అని కొన్ని రోజులు ప్రజలు సహకరించాలి అని సర్వీస్ రోడ్ పనులు త్వరలోనే పూర్తి అవుతాయి అని,ప్రజలకు సర్వీస్ రోడ్ అందుబాటులో ఉంచుతాం అని కార్పొరేటర్ తెలిపారు.

అలాగే మొన్న ప్రారంభం అయినా 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం త్వరలోనే జ్యోతి నగర్ కమ్యూనిటి హాల్ లో వినాయక నగర్,కనుకుంటా,జ్యోతి నగర్ వాసుల కొరకు ఏర్పాటు చెయ్యనున్నాము అని కావున కాలనీ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కార్పొరేటర్ తెలిపారు.

వారితో కాలనీ అధ్యక్షుడు నర్సింగ్ రావు,సీఎం మల్లేష్,గోపాల్ రెడ్డి,రత్నకుమార్ నాయుడు,పూర్ణచందర్,ప్రభు,గిరిధర్,సత్యనందం,సుధాకర్ రెడ్డి మరియు కాలనీ సొసైటీ మెంబెర్స్.

Related Posts

You cannot copy content of this page