సీపీఐ 3 వ రాష్ట్ర మహాసభలకు భారీ ర్యాలీ తో బయలుదేరిన కుత్బుల్లాపూర్ సీపీఐ నాయకులు.

Spread the love
Kutbullapur CPI leaders left with a huge rally for the 3rd State Congress of CPI.

సీపీఐ 3 వ రాష్ట్ర మహాసభలకు భారీ ర్యాలీ తో బయలుదేరిన కుత్బుల్లాపూర్ సీపీఐ నాయకులు.

నేడు శంషాబాద్ లో జరగనున్న సీపీఐ పార్టీ రాష్ట్ర మహాసభల ప్రారంభోత్సవ బహిరంగ సభకు సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో జగతగిరిగుట్ట సీపీఐ కార్యాలయం నుండి భారీ ర్యాలీ గా బయలుదేరడం జరిగింది. ఈ ర్యాలీ ని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యూసుఫ్ ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్తితులపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల ప్రతినిధులు పాల్గొని చర్చలు జరిపి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారు అని అన్నారు.
ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి ఉమమహేష్ నాయకత్వం వహించగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి,హరనాథ్, మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య,రాము,కోశాధికారి సదానంద,మహిళా సమాఖ్య కార్యదర్శి హైమావతి, యువజన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సంతోష్, వెంకటేష్,మండల కార్యవర్గ సభ్యులు నర్సయ్య, శ్రీనివాస్, కృష్ణ,రాములు, వెంకటేష్, ప్రవీణ్,సాయులు,జార్జ్,చంద్రయ్య,యాకుబ్ తో పాటు వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page