మృతునికుటుంబాన్ని పరామర్శించిన కోరం కనకయ్య,

Spread the love

Koram Kanakaiah visited the family of the deceased.

మృతునికుటుంబాన్ని పరామర్శించిన కోరం కనకయ్య, మేకల మల్లిబాబు యాదవ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కామేపల్లి మండలం పింజరమడుగు తండా కు చెందిన వాంకుడోత్ సక్రియ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి, మేమున్నాం అంటూ భరోసా కల్పించారు..

తండ్రిని కోల్పోయిన పిల్లలకు , చదువు నేర్పించడానికి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి తెలియజేసి వారి ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందించగలమని మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు షేక్ పత్తే మహమ్మద్ పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page