టీఆర్ఎస్ బంగారు కూలీ కేసు తేలకుండా బీఆర్ఎస్ గా పేరు ఎలా మారుస్తారు

Spread the love

How will the name of TRS be changed to BRS without resolving the gold wage case

టీఆర్ఎస్ బంగారు కూలీ కేసు తేలకుండా బీఆర్ఎస్ గా పేరు ఎలా మారుస్తారు:టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

సాక్షిత : టీఆర్ఎస్ పార్టీ బంగారు కూలీ వసూళ్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలో నేను చేసిన ఫిర్యాదు ఎటు తేలకుండానే ఆ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చడానికి వీల్లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మాల్కాజిగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని బోయిన్ పల్లిలోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు

. తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ పార్టీగా ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకుంది. దీనిపై డిసెంబరు 6 ఆలోపు అభ్యంతరాలను వ్యక్తం చేయమని ఎన్నికల సంఘం పత్రికా ప్రకటన ఇచ్చింది. ఈ విషయంపై అభ్యంతరం చేయడానికి ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఐదు రోజులైనా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో చివరికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోం మంత్రి, ఎన్నికల సంఘానికి ఆన్ లైన్ ఫిర్యాదు చేశాను.

గతంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ పేరునే రద్దు చేయాలి. ఆ కేసు పెండింగ్లో ఉండగానే టీఆర్ఎస్ పేరును మారిస్తే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లే అని ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి లేఖ రాశాను. ఆ లేఖ ఆధారంగా ఎన్నికల సంఘం ఈ ఏడాది నవంబర్ 25న సీబీడీటీ చైర్మన్ కు లేఖ రాసింది. 2019, ఫిబ్రవరి 5న ఇదే విధమైన లేఖను ఎన్నికల సంఘం సీబీడీటీకి రాసింది.

2017లో బంగారు కూలీల పేరుతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు వ్యాపారస్తుల నుంచి కోట్ల రూపాయలు బహిరంగంగా వసూలు చేశారు. బంగారు కూలీ పేరుతో వందల కోట్లు వసూల్ చేసిన పార్టీ ఆ లెక్కలు ఎక్కడా చూపించలేదని అన్నారు. దానిపై ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు.

దీంతో ఢిల్లీ హైకోర్టులో నేను కేసు వేశాను. నా వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు బంగారు కూలీల ఘటనపై టీఆర్ఎస్ పార్టీపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కు మార్గనిర్దేశనం చేసింది. టీఆర్ఎస్ పార్టీ బంగారు కూలీ వసూళ్ల కేసుపై 2018లో చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచింది. అయినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. నా ఫిర్యాదు ఎటువంటి చర్యలు తీసుకోకుండా టీఆర్ఎస్ పేరును మార్చడానికి వీలు లేదు.

ఈ వ్యవహరంలో ఎన్నికల సంఘం మీ ఆదేశాలను పాటించడం లేదంటూ, తక్షణమే ఈ ప్రక్రియపై స్టే ఇవ్వాలని నేను డిసెంబరు 6న ఢిల్లీ హై కోర్టులో కేసు ఫైల్ చేశాను, డిసెంబర్ 7న నోటిసు వెళ్లింది, సోమవారం రోజు విచారణకు వస్తుంది. ఈ క్రమంలోనే ఆగమేఘాల మీద ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పేరు మారుస్తూ లేఖ పంపింది. సోమవారం కేసు విచారణకు వస్తే ఇప్పటికే ఈ వ్యవహరంలో నిర్ణయం జరిగి పోయింది కాబట్టి నా పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చే అవకాశం ఉంది.

2018 నుంచి 2022 వరకు ఈ వ్యవహరంపై ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి, హోంమంత్రి, ఈడీ, సీబీఐకి ఇలా సంస్థలకు ఫిర్యాదు చేశాను. ఇప్పటి వరకు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ ఎందుకు విచారణ చేయడం లేదు. నిజంగా బీజేపీకి కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని భావిస్తే ఎందుకు కోర్టు ఆదేశాలను అమలు చేయించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పై ఇన్ని కేసులు పెండింగ్ లో ఉంటే.. ఏ రకంగా కేంద్ర ఎన్నికల సంఘం పేరు మార్పు ప్రక్రియ పూర్తి చేస్తుంది.

బీజేపీ సూచనలతోనే ఎన్నికల కమిషన్.. టీఆర్ఎస్‌కి సహకరించింది. ఇంత మంది వ్యాపారుల మీద దాడి చేస్తున్న ఐటీ బంగారు కూలీల వ్యవహరంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితతో ఒక రకంగా మిగతా వారితో మరొరకంగా అధికారులు ప్రవరిస్తున్నారు. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కనిమొళిని విచారణకు పిలిచి ఇప్పుడు కవితతో మాత్రం ఆమె సమయం అడుగుతున్నారు.

కనిమొళికి ఒక న్యాయం, కవితకు ఒక న్యామయా. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఢిల్లీలో విచారణకు పిలిచి కవిత వివరణ మాత్రం ఆమె కోరుకున్న సమయానికి తీసుకుంటామనడం టీఆర్ఎస్, బీజేపీ సహకరించుకుంటున్నాయి అనడానికి నిదర్శనమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారడం వెనుక పెద్ద కుట్ర ఉంది. దక్షిణ భారతదేశంలో బీఆర్ఎస్ ను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీకి ఆప్, ఎంఐఎంతోపాటు ఇప్పుడు మూడో మిత్రుడు చేరిండు అదే బీఆర్ఎస్. ఆప్, ఎంఐఎం ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడానికి ఉపయోగపడుతున్నాయి.

బీఆర్ఎస్ ను కర్ణాటకలో వాడుకోవాలని బీజేపీ చూస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని సర్వేలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడానికి కర్ణాటకలో బీఆర్ఎస్ ప్రయోగించాలని బీజేపీ కుట్ర చేస్తోంది. గుజరాత్ మోడల్ ను కర్ణాటకలో అమలు చేయాలనుకుంటున్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా కుట్ర చేస్తున్నారు. బెంగాల్ మోడల్ ను తెలంగాణలో పాటిస్తున్నారు. మోడీని చీల్చి చెండాడుతా అన్న కేసీఆర్ గుజరాత్లో కేజ్రీవాల్ తో కలిసి మోదీ వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేయలేదు.

Related Posts

You cannot copy content of this page