మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా హోలీ సంబరాలు

Spread the love

మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాణావత్ వెంకటరమణ నాయక్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలునాయక్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రంగులు చల్లుకొని స్వీట్లు పంచిపెట్టారు..

ఈ సందర్భంగా మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్ కోన ధని కుమార్ మాట్లాడుతూ…
కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రజా పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి ఫలాలు అందరి కుటుంబాల్లో సప్త వర్ణ రంగుల శోభను నింపుతాయని అన్నారు. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సమైక్యతను చాటిచెప్పే ఈ హొలీ పండుగ దేశమంతటా కొత్త మార్పుకు శ్రీకారం చుడుతుందన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా త్వరలోనే దేశంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే కొత్త ప్రజాస్వామ్య వాతావరణం వెల్లివిరిస్తుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు మున్సిపాలిటీ కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వరరావు సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జహంగీర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పారుపల్లి విజయ్ కుమార్, దేవి శెట్టి రంగారావు, తన్నీరు రామకృష్ణ, డివిజన్ కమిటీ అధ్యక్షులు బొల్లెద్దు రాజేంద్ర, కోట నాగరాజు, ఆది మూలం శ్రీనివాసరావు, అక్కినపల్లి నాగేశ్వరరావు, కోన నరసింహారావు, బాణావతి తేజ, దూదేకుల జానీ, నాగేశ్వరరావు మొదలగు వారు పాల్గొన్నారు..

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page