ఎగ్జిట్ పోల్స్‌తో హైక్ వస్తుందేమో.. కానీ ఎగ్జాట్ పోల్స్‌ గుడ్ న్యూస్ తీసుకొస్తాయ్.

Spread the love

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. నేడు ఆయన ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయానని ట్విటర్ వేదికగా కేటీఆర్ వెల్లడించారు. ఆ తరువాత ఎగ్జిట్‌పోల్స్‌పై కూడా స్పందించారు. అయితే ఎగ్జిట్‌పోల్స్ అనంతరం ఆయన చెప్పిన మాటనే తిప్పి తిప్పి చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అనేవి పొలిటికల్ హీట్‌ను పెంచవచ్చు కానీ ఎగ్జాట్ పోల్స్ మాత్రం పక్కాగా శుభవార్తను అందజేస్తాయి’’ అని పేర్కొన్నారు. నిన్న పోలింగ్ ముగియగానే కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశాయి. అధికార పార్టీ అయితే ఈ ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మడం లేదు. మంత్రి కేటీఆర్ 70కి పైగా స్థానాల్లో అధికారంలోకి వస్తామని ఇప్పటికీ చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నామన్నారు. రియల్ పోల్ రిజల్ట్ డిసెంబర్ 3న వస్తుంది కాబట్టి కార్యకర్తలు ఎవరూ కంగారపడవద్దని సూచిస్తున్నారు. డిసెంబర్ 3 న తప్పని తేలితే ఎగ్జిట్ పోల్స్ చేసినవారు ప్రజలకి క్షమాపణ చెబుతారా? అని మరీ ప్రశ్నిస్తున్నారు..

Whatsapp Image 2023 12 01 At 4.10.33 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page