గడప గడపకు తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.

Spread the love

కూకట్ పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఫతే నగర్ డివిజన్ పరిధిలోని పైప్ లైన్ రోడ్డు నుండి ఇంటింటికీ బీజేపీ భరోసా యాత్ర 62’వ రోజు ఉదయం పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు. గడప గడపకు తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మరోసారి మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రోజురోజుకు ప్రజల్లో బీజేపీకి జనాధారణ పెరుగుతుందని ఈసారి కచ్చితంగా అవకాశం ఇస్తారని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని దేశంలో మరోసారి మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో బీజేపీకి అవకాశం కలిపిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హర్షణ పల్లి సూర్యారావు,స్టేట్ కౌన్సిల్ మెంబర్ సురేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కృష్ణాగౌడ్,సమాజిక కార్యకర్త కంచి మహేందర్,డివిజన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్,రాష్ట్ర ఓ.బి.సి మోర్చ నాయకులు రామ్మోహన్, జిల్లా యువ మోర్చ నాయకులు హరిప్రసాద్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ బానేశ్,శ్రీనివాస్ రెడ్డి, చంద్ర రెడ్డి,రేవప్ప, డివిజన్ ప్రధాన కార్యదర్శిలు యాదగిరి,నరేష్, బ్రమ్మం, గోపాల్, నాగేష్, తులసి, కార్తిక్, సాయి, అర్జున్,అస్లాం చింటూ, మనోజ్ , చైతన్య, ఉషారాణి, కృష్ణ వేణి, గణేష్, డివిజన్ ల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

9c04df9f 6feb 491a A0be B338e173d9f3

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page