శంకర్‌పల్లి మండల బిజెపి యువ మోర్చా అధ్యక్షుడిగా హర్ష నాయక్

Spread the love

శంకర్‌పల్లి మండల బిజెపి యువమోర్చా అధ్యక్షుడిగా మోకిల తండాకు చెందిన హర్ష నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్ చేతుల మీదుగా హర్ష నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ యువత అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యువకుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెలిబుచ్చారు. తన పదవికి సహకరించిన మున్సిపల్, మండల నాయకులకు హర్ష కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వాసుదేవ్ కన్నా, విశ్వనాథ్, సాకేత్ రెడ్డి, లోకేష్ ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page