పటాన్ చెరువులో మైత్రి గ్రౌండ్ లో MDR’s యంగ్ లీడర్స్ అసోసియేషన్ ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్-2023 ఘనంగా ఘనంగా ముగింపు వేడుకలు.

Spread the love

పటాన్ చెరువులో మైత్రి గ్రౌండ్ లో MDR’s యంగ్ లీడర్స్ అసోసియేషన్ ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్-2023 ఘనంగా ఘనంగా ముగింపు వేడుకలు.

సాక్షిత : విన్నర్స్ గా నిలిచిన ఎం.ఆర్.ఎఫ్ పరిశ్రమ.
పటాన్ చెరువు నియోజకవర్గం లోని MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైత్రి గ్రౌండ్ లో ప్రారంభించిన MDR’s యంగ్ లీడర్స్ అసోసియేషన్ ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలలో భాగంగా ఫైనల్ మ్యాచ్ తలపడిన ఆర్డినెస్ ఫ్యాక్టరీ మరియు ఎం.ఆర్.ఎఫ్ పరిశ్రమలు. మొదటగా బ్యాటింగ్ చేసిన ఎంఆర్ఎఫ్ కంపెనీ 124 రన్లు చేయగా ఆ తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ 87 రన్లు చేసింది. చివరికి ఎం.ఆర్.ఎఫ్ పరిశ్రమ విన్నర్స్ గా నిలబడింది.

విన్నర్స్ కు 33,333/- రన్నర్ కు 22,222/- , రూపాయలను ప్రిత్విరాజ్ మరియు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది. MDR ఫౌండేషన్ కో ఫౌండర్ మరియు యంగ్ లీడర్స్ అసోసియేషన్ ఫౌండర్ పృథ్వీరాజ్ టోర్నమెంట్ కు సహకరించిన ప్రతి పరిశ్రమ యాజమాన్యానికి మరియు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ , మార్కెట్ చైర్మన్ విజయకుమార్ , గూడెం మదన్న , వెంకటరెడ్డి , దశరత్ రెడ్డి , మైత్రి క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ హనుమంత రెడ్డి , మరియు MDR యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page