మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం కొరకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

Spread the love

Government Whip Arekapudi Gandhi along with Corporator Ragam Nagender Yadav laid the foundation stone for the construction of the mini function hall.

సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ లో ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ సీడీపీ నిధుల నుండి మంజూరైన రూ.15 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం కొరకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గోపి నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం కొరకు ఎమ్మెల్యే  సీడీపీ ఫండ్స్   15 ,00 ,000/- పదిహేను లక్షల రూపాయలను ఎమ్మెల్యే (CDP FUNDS ) నుండి 15 లక్షల రూపాయలు మంజూరి చేయడం జరిగినది అని మినీ ఫంక్షన్ హాల్ ను త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పేద ,మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, ఇక్కడి ప్రాంత వాసులకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా ఈ మినీ ఫంక్షన్ హాల్ లో సమావేశాలు, సభలు, చిన్న చిన్న ఫంక్షన్ లు , జన్మదిన వేడుకలు ,వివాహాలు,షష్టిపూర్తి వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా మినీ ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు  సంతోషంగా ఉందన్నారు.

మినీ ఫంక్షన్ హాల్ ను అన్ని హంగులతో ,సకల సౌకర్యాలతో నిర్మించడం జరుగుతుంది అని, మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని అధికారులకు ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. గోపి నగర్ అభివృద్ధికి విశేషంగా  కృషి చేస్తానని ,మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధం అని ,ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి వచ్చిన పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .

శేరిలింగంపల్లి డివిజన్ మరియు నియోజకవర్గ అభివృద్ధికి శాయ షెక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. కాలనీ వాసులు మాట్లాడుతూ మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం కు నిధులు కేటాయించి సహాకరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ కి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని ,అదేవిధంగా ఎమ్మెల్యే గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని  కొనియాడారు .

ఈ కార్యక్రమంలో TSRICL AE చందు, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు అబీబ్ ,చింతకింది రవీందర్ గౌడ్,పొడుగు రాం బాబు,పద్మారావు,విరేశం గౌడ్, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, యాదా గౌడ్, KN రాములు, రమణ, గోపి కృష్ణ, గోపాల్ యాదవ్, నర్సింహ రెడ్డి, బసవరాజు సంతోష్, శ్రీ కళ, కవిత,పర్వీన్, మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page