గిద్దలూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించిన మదిరె రంగ సాయి రెడ్డి

Spread the love

గిద్దలూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించిన మదిరె రంగ సాయి రెడ్డి

ప్రకాశం జిల్లా గిద్దలూరు లో ప్రజా సంకల్ప వేదిక ఆద్వర్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.

ఈ సదస్సులో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ప్రజా సంకల్ప వేదిక సభ్యులు పాల్గొన్నారు.

ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరె రంగ సాయి రెడ్డి గారు సమాచార హక్కు చట్టంపై మరియు ఇతర ప్రజా రక్షణ చట్టాలపై అవగాహన కల్పిస్తూ చట్టాలపై కనీస అవగాహన పౌరుల ప్రాథమిక బాధ్యతని తెలిపారు.

సదస్సులో పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది.

ఈ సదస్సులో రాష్ట్ర గౌరవాధ్యక్షులు జె బాలయ్య యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పలనాటి మహబూబ్ పిర, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అజాద్ ఖాన్ పఠాన్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఓ వెంకటయ్య యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రంగ స్వామి, వెంకటేశ్వర్లు, బాషా, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీ దేవి గారు, ఇంఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page