3 లక్షల 39 వేల విలువ గల గంజాయి ధ్వంసం … అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి ప్రసాద్

Spread the love

Ganja worth 3 lakh 39 thousand destroyed … Additional SP Admin D Prasad

3 లక్షల 39 వేల విలువ గల గంజాయి ధ్వంసం … అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి ప్రసాద్

సాక్షిత న్యూస్ కర్నూల్

ఏపీ డిజిపి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ పర్యవేక్షణలో ఆదివారం భారీగా గంజాయిని ధ్వంసం చేసి నిప్పు అంటించి తగలబెట్టారు.


ఈ సంధర్బంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి ప్రసాద్ మీడియా తో మాట్లాడారు.
ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కర్నూలు జిల్లా లో వివిధ పోలీసుస్టేషన్ ల పరిధులలో 12 కేసులలోని 67 ముద్దాయిల నుండి స్వాధీనం చేసుకున్న 113 కేజీ ల (కేజీ విలువ 3 వేలు) గంజాయిని కర్నూలు నగర సమీపంలోని దిన్నేదేవరపాడు దగ్గర ఉన్న జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ధ్వంసం చేశామన్నారు.


పెండింగ్ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ మొత్తాన్ని కోర్టు మెజిస్ట్రేట్ అనుమతితో , నుప్స్ యాక్ట్ ప్రకారం ప్రోసిడింగ్స్ చేసి పంచనామా ప్రకారం గంజాయిని ధ్వంసం చేసి కాల్చి వేయడం జరిగిందన్నారు. దహనం చేసిన గంజాయి విలువ 3 లక్షల 39 వేల రూపాయలకు పైగా ఉంటుందన్నారు. జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక దృష్టి ఉంచామన్నారు.

ఓ కమిటీని ఏర్పాటు చేసి ప్రత్యేక పోలీసు బృందాలతో స్లమ్ ఏరియాలతో పాటు కళాశాలల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పత్తికొండ డిఎస్పీ శ్రీనివాసులు, సిఐలు ప్రసాద్, జాన్సన్, తబ్రేజ్ , శ్రీనివాసులు, శివశంకర్, ఎస్ఐలు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page