95 లక్షల వ్యయంతో నూతనంగా కాంపౌండ్ వాల్, మరియు పార్క్ అభివృద్ధి పనుల కొరకు శంకుస్థాపన

Spread the love

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , సుమారు 95 లక్షల వ్యయంతో నూతనంగా కాంపౌండ్ వాల్, మరియు పార్క్ అభివృద్ధి పనుల కొరకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో కూకట్పల్లి నియోజకవర్గం వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందిందని ఒకప్పుడు అల్లాపూర్ డివిజన్ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ లేక ఎంతో అస్తవ్యస్తంగా ఉండేదని కానీ నేడు అల్లాపూర్ డివిజన్ కి చుట్టుపక్కల ఫ్లై ఓవర్లు సుందరమైన రోడ్లు మంచినీటి పైప్లైన్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దేనిని అన్నారు… ఇంకా పెండింగ్ లో ఉన్న పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అల్లాపూర్ డివిజన్ ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు….

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల అయిలయ్య, de ఆనంద్..ae రంజిత్.. తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page