దుర్గా మాత మండపాలను సందర్శించి, అమ్మ వారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Spread the love

Former MLA Kuna Srisailam Goud who visited Durga Mata mandapams and visited Amma

దుర్గా మాత మండపాలను సందర్శించి, అమ్మ వారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్


సాక్షిత : * దేవి నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఎన్.ఎల్.బీ నగర్, షాపూర్ నగర్ హెచ్.ఎం.టీ సొసైటీ లో ఏర్పాటు చేసిన దుర్గా మాత మండపాలను మాజీ ఎమ్మెల్యే, బీజేపి రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.

ప్రజలంతా అమ్మ వారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఉత్సవ కమిటీ సభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ని శాలువా కప్పి సత్కరించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page