శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ, శ్రీ పోచమ్మ దేవస్థానం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, డి. పోచంపల్లి 8 వార్డు, బి చంద్ర శేఖర్ రెడ్డి నగర్ కాలనీ లో ఈరోజు జరిగిన శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ, శ్రీ పోచమ్మ దేవస్థాన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీశైలం గౌడ్ ని ఘనంగా సత్కరించారు. ఆలయాల సందర్శనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని, అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page