పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. మాజీ ఎంపీపీ ఇంట్లోకి ప్రవేశించి…

Spread the love

Firing in Palnadu district. Ex-MPP entered house…

పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. మాజీ ఎంపీపీ ఇంట్లోకి ప్రవేశించి…

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.

బాలకోటిరెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయారు. గాయాలపాలైన బాలకోటిరెడ్డిని కుటుంబసభ్యులు నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ప్రత్యర్థుల దాడిలో టీడీపీ మండలాధ్యక్షుడు బాలకోటిరెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page