శుభోదయ కాలనీ, AS రాజు నగర్ కాలనీ ల లో రూ.1 కోటి 13 లక్షల 90 వేల రూపాయల అంచనా వ్యయం

Spread the love


Estimated cost of Rs.1 Crore 13 Lakh 90 thousand in Subhodaya Colony, AS Raju Nagar Colony

సాక్షిత : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీ,ఆల్విన్ కాలనీ ఫేస్ 1, శుభోదయ కాలనీ, AS రాజు నగర్ కాలనీ ల లో రూ.1 కోటి 13 లక్షల 90 వేల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివుద్ది ఆగకూడదనే ఉద్దేశ్యం తో సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా వివేకానంద నగర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, వరద నీటి కాల్వ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని, కాలనీ లలో వర్షాలకు దెబ్బ తిన్న రోడ్ల ను పునరుద్ధరించడమే ధ్యేయం గా సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని, అన్ని కాలనీ లలో మెరుగైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, అన్ని రకాల మౌలిక వసతుల తో, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో సుందర శోభిత వనాలుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

మంజూరైన అభివృధి పనుల వివరాలు…

సప్త గిరి కాలనీ లో రూ.27.40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు

ఆల్విన్ కాలనీ ఫేస్ 1 కాలనీ లో రూ.38.05 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు

శుభోదయ నగర్ కాలనీ లో రూ.25.65 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు

AS రాజు నగర్ కాలనీ లో రూ.22.80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు
శంకుస్థాపన చేయడం జరుగుతుంది.

పైన పేర్కొన్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు,వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయి నేని చంద్రకాంత్ రావు,ఎర్రబెల్లి సతీష్ రావు, కార్తిక్ రావు,హరినాథ్, రాంచందర్,ఆంజనేయులు ,అల్లం మహేష్, చంద్రమోహన్ సాగర్,మోహన్ రావు, విద్య సాగర్, విద్యాసాగర్, వెంకట్ రెడ్డి, రమణ రెడ్డి, సంపత్, కాలనీ వాసులు శర్మ, మల్లయ్య, నర్సింహ రావు, వెంకటేష్ గౌడ్, సంపత్ రెడ్డి, అంజి రెడ్డి, శాస్త్రి, సంపూర్ణాంద్, వెంకటేశ్వర రావు, సాయి సురేష్ , శ్రావణి రెడ్డి, హేమలత, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page