జిల్లా సభ్యుల సమావేశం ఏప్రిల్ 12న

Spread the love

బాపట్ల జిల్లా

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. జిల్లా సభ్యుల సమావేశం ఏప్రిల్ 12న బుధవారం ఉదయం 10 గంటలకు బాపట్ల సిపిఐ పార్టీ బాపట్ల జిల్లా కార్యాలయంలో జరుగును. ఈ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట్రావు సీపీఐ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి తన్నీరు సింగర కొండ హాజరవుతారు కావున జిల్లాలోని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరు కాగలరు. ఈ సమావేశం ముఖ్య అజెండా, వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వాలు, మండల మహాసభలు, జిల్లా మహాసభల నిర్వహణ తేదీల ప్రకటన, జిల్లా నూతన నాయకత్వ ఎన్నిక జరుగునని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా నాయకులు జెల్ది భాగ్య శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా సీనియర్ నాయకులు పమిడి బోయిన రామాంజనేయులు, కంచర్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page