బొల్లారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా బీ.సీ బంధు చెక్కులు పంపిణీ

Spread the love

సాక్షిత : బొల్లారం మున్సిపాలిటీకి చెందిన ఐదు మంది లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంజూరైన లక్ష రూపాయల(1,00,000/-) ఆర్థిక సాయాన్ని గ్రాంటు రూపంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అందజేశారు. పటాన్చెరువు పట్టణంలోని జి.ఎం.ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా మంజుల, యాదయ్య, సంపత్, నరసింహారావు, అనిత అనే ఐదుగురు లబ్ధిదారులకు బి.సి బంధు చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ… అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ అభిమతమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ , సత్యనారాయణ (ఎమ్మెల్సీ), జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు ప్రభాకర్ , మున్సిపల్ కమీషనర్ సంగారెడ్డి , బి.ఆర్.టి యు రాష్ట్ర కార్మిక నాయకులు వి.వరప్రసాద్ రెడ్డి , మున్సిపల్ కౌన్సిలర్లు గోపాలమ్మ , చంద్రయ్య , మున్సిపల్ నాయకులు చక్రపాణి , వెంకటయ్య , పార్టీ మున్సిపల్ యువత నాయకులు ప్రవీణ్ రెడ్డి, కార్యకర్తలు, లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page