అల్లిపురం వద్ద 2.50 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న క్రిస్టియన్ సమాధుల తోట అభివృద్ధి

Spread the love

development-of-christian-cemetery-garden-at-allipuram-at-a-cost-of-rs-2-50-crores

సాక్షిత : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్, అల్లిపురం వద్ద 2.50 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న క్రిస్టియన్ సమాధుల తోట అభివృద్ధి పనులను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు నగర మేయర్ శ్రీమతి పొట్లూరి స్రవంతి.

నెల్లూరు నగర, రూరల్ క్రిస్టియన్ ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ఈ సమాధుల తోటను నిర్మించడం జరుగుతుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

అల్లిపురం దగ్గరవుండే టిడ్ కో ఇళ్లవద్ద అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా క్రిస్టియన్ శ్మశానవాటిక పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. క్రిస్టియన్ శ్మశానవాటిక పనులు అక్టోబర్ ఆఖరికి పూర్తిచేసి, నవంబర్ 2వ తేదీ క్రిస్టియన్ సమాధుల పండుగ రోజు దీనిని ప్రారంభించడం జరుగుతుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

క్రిస్టియన్ సమాధులతోట వద్ద అన్నివసతులతో, రోడ్లు, డ్రెస్సింగ్ రూమ్స్, మంచినీరు, లైటింగ్, వాచ్మెన్ క్వార్టర్స్ అన్ని కలగలిపి, క్రిస్టియన్ సమాధులతోటను అందంగా, సర్వాంగ సుందరంగా నిర్మించడం జరుగుతుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

రూరల్ నియోజకవర్గంలోని స్మశానవాటికలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుంది. స్మశవాటికలంటే మన పూర్వీకులు, పెద్దలు విశ్రాంతి తీసుకునే స్థలాలు కాబట్టి వాటిని అన్నివిధాల అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరిది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

Related Posts

You cannot copy content of this page