దీప్తి శ్రీ నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ ముఖద్వారం

Spread the love

Deepti Sri Nagar Colony newly established Colony Mukhadwara

సాక్షిత : చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ ముఖద్వారంను కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దీప్తి శ్రీ నగర్ కాలనీ లో ఈ రోజు కాలనీ ముఖ ద్వారం ప్రాంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని,కాలనీ ముఖద్వారం కాలనీ కి చిరునామాకు సంకేతంగా ఉపయోగపడుతుంది అని,కాలనీ కి గుర్తుగా తొడపడుతుంది అని , ప్రజలకు ఉపయోగకరంగా ఉంటది అని , దీప్తి శ్రీ నగర్ కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని కాలనీ ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ,కాలనీ,చందానగర్ డివిజన్ ను మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కి శాయశేక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు,MD ఇబ్రహీం, రమేష్,వరలక్ష్మి రెడ్డి, కార్తిక్ గౌడ్,దాస్ ,నరేందర్ బల్లా,యశ్వంత్ ,అమిత్ దుబే, సందీప్ రెడ్డి మరియు దీప్తి శ్రీ నగర్ కాలనీ వాసులు సీతారామయ్య ,పూర్ణచంద్రరావు , చంద్రశేఖర్, రాజు , సుమన్ రెడ్డి , మంగపతి , శోభాశ్రీ , రామారావు , విజయ్ కుమార్ , రాములు , రవీందర్ బాబు , శ్రీనివాస్ ,సుధాకర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page