పటాన్ చెరు మండలంలో ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నదామోదర్ రాజనర్సింహ

Spread the love

పటాన్ చెరు మండలంలో ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైద్య ఆరోగ్య మరియు సైన్స్ & టెక్నాలజీ మంత్రి దామోదర్ రాజనర్సింహ


సాక్షిత : పటాన్ చెరు మండలం పోచారం గ్రామంలో ప్రజా పాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు సైన్స్& టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ * మరియు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి రసీదులను వారికి అందజేశారు. ప్రజా పాలన అభయహస్తం ఆరు గ్యారెంటీలు అమలును అర్హులైన పేదలకు పారదర్శకంగా అందించాలనే ఉద్దేశ్యంతో ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు పది రోజులు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page