అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు సాయం అందజేసిన దళిత రవీందర్

Spread the love

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామం లో అంబేద్కర్ విగ్ర ప్రతిష్టకు 10వేల రూపాయల సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్ అందజేశారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని నడవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసింహ, గుండ్రాంపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు నమ్ముల విజయ్ కుమార్, మాజీ సర్పంచ్ ఎసిరెడ్డీ బుచ్చిరెడ్డి, మాజీ సింగిల్ విండోయ్ చైర్మన్ గార్లపాటి రవీందర్ రెడ్డి, అంబేద్కర్ సంఘ అధ్యక్షులు బస్సు మధుసూదన్, ఎంపిటిసి దుబ్బ పద్మ కుమార్ స్వామి, వార్డ్ నెంబర్ అండాల ప్రవీణ్ కుమార్, అంబేద్కర్ సంఘ ప్రధాన కార్యదర్శి దుబ్బ విగ్నేశ్వర్, సహయ కార్యదర్శి కాసర రాజు, రెడపాక చంద్రశేఖర్, జిల్లా లింగస్వామి, రెడపాక యాదయ్య,నమ్ముల కిరణ్, సీనియర్ నాయకుడు బండ కృష్ణయ్య, బండ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page