ప్రాణాపాయ స్థితిలో చికిత్స అందించేందుకు క్రిటికల్ కేర్ బ్లాక్ దోహదం

Spread the love

గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

రూ. 23.75 కోట్ల భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని 300 పడకల ఆసుపత్రి సమీపంలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స అందించేందుకు క్రిటికల్ కేర్ బ్లాక్ నేషనల్ నేషన్ లో భాగంగా రూ.23.75 కోట్లతో గద్వాల జిల్లాకు మంజూరైన క్రిటికల్ కేర్ బ్లాక్ భవన నిర్మాణానికి గద్వాల శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి చేసి పనులను ప్రారంభించడం జరిగినది.

ఎమ్మెల్యే మాట్లాడుతూ….

నేడు అయోధ్య లో శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అయోధ్య రామ దేవాలయం ప్రారంభోత్సవం ప్రజలందరికీ శుభాకాంక్షలు…

మానవసేవే -మాధవసేవ భాగంలో

కేంద్ర ప్రభుత్వం ద్వారా క్రిటికల్ కేర్ బ్లాక్ ను గద్వాల జిల్లా మంజూరు కావడం జరిగినది.

రోడ్డు ప్రమాదంలో గాయప డటం మరియు పాముకాటు వంటి సంఘటనలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు చికిత్స అందించేందుకు క్రిటికల్ కేర్ భావన నిర్మిస్తున్నట్లు అని తెలిపారు.

గతంలో కర్నూలు హైదరాబాదు వంటి ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండేది అక్కడ వెళ్లే లోపు ప్రమాదంతో గాయపడిన వారికి దారుణమైన పరిస్థితి ఏర్పడింది అలాంటి పరిస్థితి భవిష్యత్తులో లేకుండా ఉండాలని గద్వాలలోని క్రిటికల్ కేర్ బ్లాక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. త్వరలో నిర్మాణం పనులు పూర్తి చేసి అన్ని రకాల సదుపాయాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని తెలిపారు.

అనంతరం నర్సింగ్ కాలేజీ హాస్టల్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే గారు పరిశీలించడం జరిగినది .

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ మురళి, శ్రీను ,నరహరి గౌడు కృష్ణ, మహేష్, గద్వాల టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగులు యాదవ్, సుధాకర్, రిజ్వాన్, వీరేష్ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 22 At 11.58.50 Am

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page