ఈ నెల 11 న కొత్తగూడెంలో లక్ష మంది ఎర్రసైన్యంతో జరిగే ప్రజా గర్జనకు కుతాబుళ్లపూర్ నియోజకవర్గ నుండి వందలాది కార్యకర్తలు శనివారం నాడే బయలుదేరి వెళ్లాలని కోరుతూ నేడు షాపూర్ నగర్లో కార్యకర్తలకు పులుపునివడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఏసురత్నం,ఉమా మహేష్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువజనులు ఎదుర్కుంటున్న సమస్యల పై రాష్ట్ర ప్రభుత్వానికి తేలియచేసే విదంగా రానున్న ఎన్నికల్లో సీపీఐ ఒంటరిగా నైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని తెలియచెయ్యడానికి ఈ గర్జనను నిర్వహిస్తున్నామని ఇప్పటికే కార్యకర్తలు అందరూ సిద్ధం అయ్యిఉన్నారని కార్యకర్తలే కాకుండా కమ్యూనిస్టు పార్టీ అభిమానులు కూడా రావొచ్చని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు స్వామి నాయకత్వం వహించగా ఏఐటీయూసీ మునిసిపల్ కోశాధికారి హరినాథ్,జిల్లా అధ్యక్షుడు రాములు,మండల సహాయ కార్యదర్శి రాము,సీపీఐ నాయకులు అశోకరెడ్డి, శ్రీనివాస్,భిక్షపతి, నర్సిహ్మ రెడ్డి,మోగిలప్ప తదితరులు పాల్గొన్నారు