లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ

Spread the love

Construction of CC roads to be undertaken with an estimated cost of lakhs of rupees

సాక్షిత : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి లో గల ప్రైమ్ మార్క్ సిగ్నస్ అపార్ట్మెంట్స్ నుండి మసీదు వరకు, డైమండ్ హైట్స్, గోపన్ పల్లి తండా, కేశవ నగర్, TNGO’S కాలనీ, సాయి ఐశ్వర్య కాలనీలలో రూ.3.28 మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మరియు ఓపెన్ జిమ్ ను కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివుద్ది ఆగకూడదనే ఉద్దేశ్యం తో సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన

,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ రోజు ఓపెన్ జిమ్, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని ,

ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, థీమ్ పార్క్ ల ను అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని, ఓపెన్ జిమ్ వలన పిల్లలకు, యువతకు, వృద్ధులకు కాలనీ వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుంది

అని, కాంక్రీట్ కి కారణ్యంలో థీమ్ పార్క్ కూడా లు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతాయి అని, థీమ్ పార్క్ లను అన్ని రకాల మౌలిక వసతుల తో, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో సుందర శోభిత వనాలుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ గారు చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది ,

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

Related Posts

You cannot copy content of this page