ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ మంత్రులు,ఎమ్మెల్యేలు

Spread the love

Telangana Ministers and MLAs left for Delhi

ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ మంత్రులు,ఎమ్మెల్యేలు సాక్షిత హైదరాబాద్‌: దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభం సందర్భంగా తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి పయనమయ్యారు. ముఖ్యమంత్రి, భారాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీలో చేసే రాజ శ్యామల యాగం, కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు బయలు దేరారు.

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ , కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు ఢిల్లీకి బయలుదేరిన వారిలో ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page