ఆస్తి పన్ను చెల్లింపులకు చివరి అవకాశం: కమిషనర్ శ్రీనివాస్

Spread the love

సాక్షిత శంకర్‌పల్లి: ఆస్తి పన్ను చెల్లింపులకు చివరి అవకాశం అని శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 90 శాతం అపరాధ రుసుము నీటితో ముగియనున్నదని, అందువల్ల పట్టణ ప్రజలు తమ యొక్క ఆస్తి పన్నును తక్షణమే చెల్లించి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లేనియెడల 90% అపరాధ రుసుముతో పాటు మరలా అదనంగా 2024 – 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను కూడా ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి అమలులోకి వస్తుందన్నారు. కాబట్టి పన్ను భారం పెరుగును కావున ఈ సంవత్సరానికి సంబంధించి ఎటువంటి బకాయిలు ఉన్న ఆన్ లైన్ ద్వారా కానీ, ఆఫీసు నందు గాని పన్నులను చెల్లించాలన్నారు. నేడు ఆదివారం కార్యాలయం తెరిచి ఉండునని పేర్కొన్నారు.

Related Posts

You cannot copy content of this page